తెలంగాణలో ఇవ్వాళ టెన్త్​ ఫలితాలు

తెలంగాణలో ఇవ్వాళ టెన్త్​ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్​లోని ఎస్​సీఈఆర్టీ కాంప్లెక్స్ లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన రిజల్ట్స్​ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను  https://results.bsetelangana.org  లేదా results.bse.telangana.gov.in వెబ్ సైట్​లో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించగా, ఐదు లక్షల మంది స్టూడెంట్స్​ అటెండ్ అయ్యారు.