
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ కాంప్లెక్స్ లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://results.bsetelangana.org లేదా results.bse.telangana.gov.in వెబ్ సైట్లో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించగా, ఐదు లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు.