టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ

హైదరాబాద్: టాలీవుడ్  డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిజిటల్ వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు ఈడీ మరోసారి లేఖ రాయడం టాలీవుడ్ ను కలవరపరుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన  వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఈడీ ఇటీవల  హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. 

ఈడీ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు మరోసారి  లేఖ రాసింది ఈడీ. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు కావాలని ఈడీ కోరింది.