
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ చిప్ల తయారీ కంపెనీ టవర్ సెమీకండక్టర్ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ సబ్మిట్ చేసింది. ఈ ప్లాంట్ కోసం 8 బిలియన్ డాలర్లు వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కంపెనీ 65 ఎన్ఎం, 40 ఎన్ఎం చిప్లను ఇండియాలో తయారు చేయనుంది. చిప్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల విలువైన స్కీమ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. టవర్ సెమీకండక్టర్ భాగం పంచుకున్న ఐఎస్ఎంసీ కన్సార్టియం దేశంలో ప్లాంట్ పెట్టేందుకు2022 లో ప్రపోజల్ సబ్మిట్ చేసింది. కానీ, అప్పుడు టవర్ సెమీకండక్టర్ను ఇంటెల్ కొనుగోలు చేసే ప్రాసెస్లో ఉండడంతో, ఈ ప్రపోజల్ ముందుకు కదలలేదు.