ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డే గుర్తొచ్చిండు : రేవంత్

ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డే గుర్తొచ్చిండు : రేవంత్

బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్ గుజరాత్ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యాపార భాగస్వామైన కేజ్రీవాల్ను గెలిపించుకునేందుకు ఎందుకు ప్రచారం చేయలేదని అన్నారు. బీజేపీపై కొట్లాడుతామంటున్న కేసీఆర్ కాంగ్రెస్ పై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ దుర్మార్గాల్లో కేసీఆర్ భాగస్వామ్యం లేదా అని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ప్రాజెక్టులు గురించి మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డి గుర్తుకొచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని కనీసం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో కూడా ఇళ్లకు త్రాగునీరు రావడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల రైతుల గురించి ఆలోచించే ముందు  కేసీఆర్ మొదట రాష్ట్రంలోని అన్నదాతల గురించి ఆలోచించాలని హితవు పలికారు. 

గత ప్రధానులు 67 ఏళ్లలో రూ. 56 లక్షల కోట్లు అప్పు చేస్తే..  ప్రధాని మోడీ 8ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పు చేశారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల అవసరాల కోసం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. ‘‘ కాంగ్రెస్ 150 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించడంతో పాటు లక్షా 5వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, పేదలకు విద్య, వైద్యం కల్పించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు.