కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ టూర్

 కాంగ్రెస్ కొత్త  ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ టూర్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే  జనవరి 11న రాష్ట్రానికి రానున్నారు.  రెండు రోజుల పాటు ఆయన  హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఆయన టూర్ కు సంబంధించి ఏఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది.  జనవరి 11 ఉదయం 7:20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి 9:25 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు. 10గంటలకు ఆయన గాంధీభవన్ కు చేరుకుంటారు. తొలిరోజు ఏఐసీసీ సెక్రటరీ ఇన్‌ఛార్జ్‌లతో మాణిక్‌ రావు ఠాక్రే  భేటీ కానున్నారు. ఆ  తరువాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాణిక్‌ రావు సమావేశం అవుతారు.  ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ముందుగా డీసీసీ ప్రెసిడెంట్లతో మాణిక్‌ రావు ఠాక్రే  భేటీ కానున్నారు. అనంతరం ఫ్రంటల్ సంస్థ అధ్యక్షులతో సమావేశం అవుతారు. సాయంత్రం తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 

మాణిక్కం ఠాగూర్  స్థానంలో మాణిక్‌ రావు ఠాక్రేను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ఇటీవలే హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. 1954 లో మహారాష్ట్రలో జన్మించిన మాణిక్‌రావ్ ఠాక్రే 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 15 వరకు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా వ్యవసాయ గ్రామీణాభివృద్ది, హోం శాఖ , విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.