ట్రాక్టర్ తో బావిలో పడ్డ రైతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

ట్రాక్టర్ తో బావిలో పడ్డ రైతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ లో విషాదం జరిగింది. ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. అదుపుతప్పి బావిలో పడిపోయాడు ఓ రైతు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. మానకొండూరు మండలం బంజేరుపల్లికి చెందిన శంకర్ నిన్న సాయంత్రం తిమ్మాపూర్ లో ట్రాక్టర్ తో పొలం దున్నతుండగా.. అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్ పై మరో వ్యక్తి ఉండగా.. అప్రమత్తమై కిందకు దూకాడు. శంకర్ ట్రాక్టర్ తో సహా బావిలో పడిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటం, వర్షం కురవడం, చీకటి పడటంతో నిన్న గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళ మరోసారి గాలింపు  చేపట్టనున్నారు అధికారులు. మోటార్లతో నీటిని తోడాలని సూచిస్తున్నారు.