
హైదరాబాద్ సిటీ, వెలుగు: గచ్చిబౌలి స్టేడియం నుంచి ఆదివారం ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు గ్రేస్ క్యాన్సర్ రన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వరకు 10 కి.మీ. పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విప్రో సర్కిల్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను నానక్రామ్ గూడ – -ఓఆర్ఆర్ మార్గంలో డైవర్ట్ చేస్తారు.
మెహదీపట్నం నుంచి లింగంపల్లి, హెచ్సీయూ, మజీద్ బండ్ వైపు వెళ్లే వాహనాలకు క్యారేజ్వేలో రెండు వైపులా అనుమతి ఉంటుంది. అలాగే ఉదయం 5:00 నుంచి 8:30 వరకు ట్రక్కులు, లారీలు, గూడ్స్ క్యారియర్లు వంటి భారీ వాహనాలకు గచ్చిబౌలి ట్రాఫిక్ సీఎస్ పరిధిలోని రూట్లలోకి అనుమతించరు.