నగరంలో రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ 

నగరంలో రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ 

ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ జరగనుంది. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ సభకు వచ్చే వారికి 3 రకాల పాసులు ఇచ్చారు. జిల్లాల నుంచి వచ్చే వారికి పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ట్రాఫిక్​ డైవర్షన్​ వివరాలివీ.. 

  • చాపెల్  రోడ్డు, నాంపల్లి నుంచి  BJR విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతిస్తున్నారు.
  • గన్ ఫౌండ్రి SBI నుంచి ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్ ఫ్లై ఓవర్  వైపు నుంచి వచ్చే వాహనాలను SBI దగ్గర దారి మళ్లించి,  చాపల్  రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
  • రవీంద్రభారతి, హిల్  ఫోర్ట్  రోడ్డు నుంచి బీజేఆర్  విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తున్నారు.
  • బషీర్ బాగ్  ఫ్లై ఓవర్  నుంచి వచ్చే వెహికిల్స్ ను బీజేఆర్  విగ్రహం దగ్గర కుడివైపునకు అనుమతించకుండా గన్ ఫౌండ్రి ఎస్ బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
  • నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్ బాగ్  వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్  ఎమ్మెల్యే క్వార్టర్స్  దగ్గర దారిమళ్లించి హిమాయత్ నగర్  వై జంక్షన్  మీదుగా అనుమతిస్తారు.
  • కింగ్ కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్,  భారతీయ విద్యాభవన్  మీదుగా వెళ్లే వాహనాలను కింగ్  కోఠి ఎక్స్ రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్ మహల్ , ఈడెన్  గార్డెన్  మీదుగా అనుమతిస్తారు.
  • బషీర్ బాగ్ నుంచి పోలీస్  కంట్రోల్  రూమ్  వైపు వచ్చే వాహనాలను బషీర్ బాగ్  వద్ద దారి మళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
  • హిమాయత్ నగర్  వై-జంక్షన్  నుంచి బషీర్ బాగ్  వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్  వై-జంక్షన్  వద్ద దారి మళ్లిస్తున్నారు.