
ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ జరగనుంది. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ సభకు వచ్చే వారికి 3 రకాల పాసులు ఇచ్చారు. జిల్లాల నుంచి వచ్చే వారికి పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ట్రాఫిక్ డైవర్షన్ వివరాలివీ..
- చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి BJR విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతిస్తున్నారు.
- గన్ ఫౌండ్రి SBI నుంచి ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను SBI దగ్గర దారి మళ్లించి, చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
- రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తున్నారు.
- బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వెహికిల్స్ ను బీజేఆర్ విగ్రహం దగ్గర కుడివైపునకు అనుమతించకుండా గన్ ఫౌండ్రి ఎస్ బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
- నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర దారిమళ్లించి హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
- కింగ్ కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్ రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్ మహల్ , ఈడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు.
- బషీర్ బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వద్ద దారి మళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
- హిమాయత్ నగర్ వై-జంక్షన్ నుంచి బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై-జంక్షన్ వద్ద దారి మళ్లిస్తున్నారు.