బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని ఇంట విషాదం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని ఇంట విషాదం..

మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్  సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

 శంకర్ యాదవ్ గతంలో కూడా పలు మార్కెట్లకు అధ్యక్షుడిగా పని చేశారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. శంకర్ యాదవ్ మృతితో తలసాని ఇంట తీవ్ర విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పలువురు హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు