హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్లో విషాదం.. చెరువులో పడి ఇద్దరు మృతి.. కాపాడబోతే ప్రాణం పోయింది..

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్లో విషాదం.. చెరువులో పడి ఇద్దరు మృతి.. కాపాడబోతే ప్రాణం పోయింది..

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్లో విషాద ఘటన జరిగింది. అనాజ్పూర్ చెరువులో పడి దురదృష్టవశాత్తూ ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ప్రణీత అనే 12 ఏళ్ల బాలిక కాలు జారి చెరువులో పడింది. ప్రణీతను కాపాడబోయి ఇంద్రసేనా రెడ్డి(20) అనే యువకుడు మృతి చెందాడు. 

కూతురిని కాపాడబోయి నీటిలో మునిగిన తండ్రిని స్థానికులు కాపాడారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి హృదయ విదారక ఘటనే జరిగింది. గుడిహథ్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్‌ ఊడిపడి రెండు రోజుల క్రితం పుట్టిన పాపకు తీవ్ర గాయాలయ్యాయి.

సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి పాపపై ఊడి పడింది. పాపకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స కోసం రిమ్స్ అసుపత్రికి తరలించారు. కోద్దిగూడ  గ్రామానికి  చెందిన పాయల్ అనే మహిళ‌ రెండు రోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఇంతలోనే పాప తీవ్ర గాయాలపాలైన పరిస్థితి రావడంతో ఆ కుటుంబం కుమిలిపోయింది. పాప అపాయం నుంచి బయటపడాలని ఈ విషయం తెలిసిన వాళ్లు కోరుకున్నారు.