రెహ్మత్ నగర్ లోని ఓ ఇంట్లో విషాదం..గోడకూలి చిన్నారి మృతి

రెహ్మత్ నగర్ లోని ఓ ఇంట్లో విషాదం..గోడకూలి చిన్నారి మృతి

హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని ఓ ఇంట్లో విషాదం చోటు చేసు కుంది. వర్షాలకు గోడకూలి 8 నెలల జీవనికా మృతి చెందింది. రాత్రి సమయంలో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న జీవనికపై పక్కింటి గోడ కూలడంతో ప్రమాదం జరిగింది. దీంతో జీవనిక అక్కడికక్కడే  మృతి చెందింది.

నారాయణఖేడ్ కు  చెందిన శ్రీకాంత్, జగదేవిల  రెండో సంతానం జీవనిక. వీరు రెహ్మత్ నగర్లో నివసిస్తున్నారు. మంగళవారం  రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం రెయిలింగ్ కూలింది. ఈ శిథిలాలు రేకుల షెడ్డులో నిద్రిస్తున్న  జీవనికపై పడ్డాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందగా...శ్రీకాంత్, జగదేవిలు ప్రాణాలతో బయటపడ్డారు.