అబ్దుల్లాపూర్ మెట్లో నీట మునిగిన ప్రాణాలు

అబ్దుల్లాపూర్ మెట్లో నీట మునిగిన ప్రాణాలు

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: ప్రమాదశాత్తు నీట మునిగి సిటీలో ఒకే రోజు నలుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​లో తొలుత ఓ బాలిక చెరువులో పడగా, ఆమెను కాపాడబోయి యువకుడు కూడా మృతి చెందాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన చిన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి తన కుటుంబంతో కలిసి అబ్దుల్లాపూర్​మెట్​లో నివాసం ఉంటున్నాడు. తన బంధువుకు టిప్పర్లు ఉండగా, అనాజ్ పూర్ గ్రామంలోని ప్రైవేటు వెంచర్​లో లీజ్​కు నడుస్తున్నాయి. 

ఆదివారం సెలవు దినం కావడంతో తన కుటుంబసభ్యులు, కుమార్తె ప్రణిత (11)తోపాటు తన బంధువైన ఇంద్రసేనారెడ్డి (20)తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇదే వెంచర్​కు ఆనుకుని ఇందిరా సాగర్ చెరువు ఉండగా, అక్కడ ఫొటోలు తీసుకునే క్రమంలో ప్రణిత ప్రమాదశాత్తు జారి పడిపోయింది. గమనించిన ఇంద్రసేనారెడ్డి ఆమెను కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.