
అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: ప్రమాదశాత్తు నీట మునిగి సిటీలో ఒకే రోజు నలుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో తొలుత ఓ బాలిక చెరువులో పడగా, ఆమెను కాపాడబోయి యువకుడు కూడా మృతి చెందాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన చిన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి తన కుటుంబంతో కలిసి అబ్దుల్లాపూర్మెట్లో నివాసం ఉంటున్నాడు. తన బంధువుకు టిప్పర్లు ఉండగా, అనాజ్ పూర్ గ్రామంలోని ప్రైవేటు వెంచర్లో లీజ్కు నడుస్తున్నాయి.
ఆదివారం సెలవు దినం కావడంతో తన కుటుంబసభ్యులు, కుమార్తె ప్రణిత (11)తోపాటు తన బంధువైన ఇంద్రసేనారెడ్డి (20)తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇదే వెంచర్కు ఆనుకుని ఇందిరా సాగర్ చెరువు ఉండగా, అక్కడ ఫొటోలు తీసుకునే క్రమంలో ప్రణిత ప్రమాదశాత్తు జారి పడిపోయింది. గమనించిన ఇంద్రసేనారెడ్డి ఆమెను కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.