భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 5.
- పోస్టులు: 47 (ట్రైనీ ఇంజినీర్ I).
- ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్& ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (డేటా సైన్స్), ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్/ బీఈ లేదా ఎం.టెక్/ ఎంఈ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.150.
- లాస్ట్ డేట్: నవంబర్ 5.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు bel-india.in
- వెబ్సైట్లో సంప్రదించగలరు.
