
సికింద్రాబాద్, వెలుగు: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా.. దక్షిణ మధ్య రైల్వే మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించామన్నారు.
హెచ్ఎస్ నాందేడ్– -సంబల్పూర్, తిరుపతి– -పూరీ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను మంగళవారం వరకు రద్దు చేశారు. వాస్కోడిగామా – -షాలీమార్, హైదరాబాద్–- షాలీమార్, చెన్సై సెంట్రల్ –- షాలీమార్ మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను విజయవాడ, బలార్షా, చందాఫోర్ట్, జర్సుగూడ, ఖరగ్పూర్ మీదుగా దారి మళ్లించారు.