అక్టోబర్31న పలు రైలు సర్వీసులు రద్దు

అక్టోబర్31న పలు రైలు సర్వీసులు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా..   దక్షిణ మధ్య రైల్వే మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించామన్నారు.

హెచ్ఎస్ నాందేడ్–​ -సంబల్​పూర్, తిరుపతి– -పూరీ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను మంగళవారం వరకు రద్దు చేశారు.  వాస్కోడిగామా – -షాలీమార్, హైదరాబాద్–​- షాలీమార్, చెన్సై సెంట్రల్ –​- షాలీమార్​ మధ్య నడుస్తున్న ఎక్స్​ప్రెస్​ రైళ్లను విజయవాడ, బలార్షా, చందాఫోర్ట్​, జర్సుగూడ, ఖరగ్​పూర్​ మీదుగా దారి మళ్లించారు.