
కోల్కత్తా: తృణముల్ కాంగ్రెస్ (TMC) లోక్ సభ ఎంపీ మహువా మొయిత్రా 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు. బెర్లిన్లో 14 రోజుల క్రితం ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మహిళా టీఎంసీ ఎంపీ తన పెళ్లి విశేషాలు మీడియాతో పంచుకునేందుకు విముఖత వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ లోని కృష్ణ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మొయిత్రా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఇక.. ఆమె పెళ్లి చేసుకున్న మిశ్రా విషయానికొస్తే.. ఒడిశాకు చెందిన సీనియర్ పొలిటీషియన్. మాజీ ఎంపీ కూడా.
Breaking : TMC MP Mahua Moitra weds BJD MP Pinaki Mishra in Berlin, Germany.
— Roshan Rai (@RoshanKrRaii) June 5, 2025
This proves that age is no barrier to finding love.
Congratulations to the couple. pic.twitter.com/QUajmgZbkC
1959లో జన్మించిన పినాకి మిశ్రా సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్గా కూడా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మిశ్రా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 1996లో పూరీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కొన్నేళ్లకు ఆయన బీజేడీలో చేరారు. పలుమార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మొయిత్రా 1974లో అస్సోంలో జన్మించారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఆమె తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత కొన్నేళ్లకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
2010లో తృణముల్ కాంగ్రెస్లో చేరారు. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణ నగర్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. డేనిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్తో మొయిత్రాకు వివాహం జరిగినప్పటికీ కొన్నేళ్లకే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్తో దాదాపు మూడేళ్ల పాటు ఈ టీఎంసీ మహిళా ఎంపీ రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఒడిశాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, తనకంటే 15 ఏళ్లు వయసులో పెద్ద వాడైన పినాకి మిశ్రాను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నారు.