బీజేపీ అభ్యర్థి కారు ధ్వంసం: రెచ్చిపోయిన తృణముల్ కార్యకర్తలు

బీజేపీ అభ్యర్థి కారు ధ్వంసం: రెచ్చిపోయిన తృణముల్ కార్యకర్తలు

బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటాల్ బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్ వాహనాన్ని తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని ధ్వంసం చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భారతి ఘోష్… వెళ్తుండగా అడ్డుకున్నారు. కేశ్ పూర్ దగ్గర రోడ్డుపై తృణమూల్ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడి తర్వాత భారతి ఘోష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనలో భారతి ఘోష్ భద్రతా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. అటు ఘోష్.. మొబైల్ ఫోన్ తో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి వీడియో తీశారన్ని ఫిర్యాదుపై ఈసీ రిపోర్ట్ కోరింది.