సెకండ్ ఇన్నింగ్స్ లోను తగ్గని క్రేజ్.. త్రిష 10 కోట్ల రెమ్యునరేషన్

సెకండ్ ఇన్నింగ్స్ లోను తగ్గని క్రేజ్.. త్రిష 10 కోట్ల రెమ్యునరేషన్

వయసు పెరుగుతున్నా కొద్దీ త్రిషలో అందం రెట్టింపు అవుతోంది. గ్లామర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా నేటి తరం యువ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ అమ్మడి లుక్స్ ఉంటున్నాయి. లియో హిట్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన త్రిష వరుస అవకాశాలతో అదరగొట్టేస్తుంది. 

కోలీవుడ్ లో ప్రస్తుతం కమల్ 234 సినిమాలో చాన్స్ అందుకున్న అమ్మడు..అజిత్ కుమార్ హీరోగా వస్తున్న విడా ముయార్చి లో కూడా నటిస్తోంది. కెరీర్ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న టైం లో డిమాండ్ ని బట్టి క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. అందుకే నిన్న మొన్నటిదాకా 2, 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న త్రిష రాబోయే సినిమాలకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుందట. 

తనని హీరోయిన్ గా తీసుకోవాలనుకునే వారికి రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తుంది అమ్మడు. తెలుగులో కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా ఇలా రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్లే ఆ అవకాశాలు చేజారాయని తెలుస్తోంది. త్రిష ప్రస్తుత లుక్స్ ఆడియన్స్ ని అలా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి అందాల భామని తీసుకోవాలంటే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనట. 

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష డిస్కషన్స్లో ఉందని వార్తలు వచ్చాయి. కానీ అనుష్క ఫైనల్ అయిన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మాత్రం త్రిష ని సెలెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.