ఓపక్క వెంకటేష్, నాని.. మరోపక్క రామ్.. డెసిషన్ మార్చుకున్న గురూజీ?

ఓపక్క వెంకటేష్, నాని.. మరోపక్క రామ్.. డెసిషన్ మార్చుకున్న గురూజీ?

త్రివిక్రమ్(Trivikram) డెసిషన్ చేంజ్ చేసుకున్నారా? తరువాత సినిమా అల్లు అర్జున్(Allu Arjun) తో కాదా? గుంటూరు కారం(Guntur kaaram) రిజల్టే కారణమా? హిట్టు కొట్టాకే పాన్ ఇండియా మూవీనా? ఇవే ప్రస్తుతం త్రివిక్రమ్ ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతున్న ప్రశ్నలు. అవును ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. నిజానికి గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. పాన్ ఇండియా లెవల్లో భారీగా వస్తున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో వస్తుందనే వార్తలు వినిపించిన ఈ సినిమాపై అప్పటినుండి అంచనాలు భారీగా పెరిగాయి. 

కానీ, త్రివిక్రమ్ తాజా మూవీ గుంటూరు కారం సినిమా రిజల్ట్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాపై పడనుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి గుంటూర్ కారం సినిమాపై ముందునుండి మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేశారు. కానీ, రిలీజ్ తరువాత ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది ఈ మూవీ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు   ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో త్రివిక్రమ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. దీంతో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమాపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారట త్రివిక్రమ్. అందుకే.. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసి హిట్టు కొట్టి అల్లు అర్జున్ సినిమాను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడట.

ఇక చాలా కాలంగా త్రివిక్రమ్, వెంకటేష్, నాని కాంబోలో ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రానుంది అనే వార్తలు వినిపిస్తన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి ఉస్తాద్ హీరో రామ్ వచ్చాడు. రామ్ తో కూడా సినిమా చేయాలని చూస్తున్నారట త్రివిక్రమ్. ఈ రెండు ప్రాజెక్టులలో ఏది ఒకటి ఫైనల్ చేసి హిట్టు కొట్టాకే అల్లు అర్జున్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ఫైనల్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.