ఐకేపీ సెంటర్ పరిశీలనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఐకేపీ సెంటర్ పరిశీలనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • గో బ్యాక్‌ సంజయ్‌ అంటూ టీఆర్‌‌ఎస్ నేతలు, కార్యకర్తల నినాదాలు

నల్గొండ జిల్లాలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ టూర్ ఉద్రిక్తంగా మారింది. సంజయ్ టూర్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సంజయ్ గో బ్యాక్ నినాదాలు చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అటు సంజయ్ టూర్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు... రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మధ్యే.. ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ ను పరిశీలించారు బండి సంజయ్. కాసేపట్లో మిర్యాలగూడ వెళ్లనున్నారు బండి సంజయ్. అక్కడ కూడా.. ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. యాసంగి పంట కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చి బీజేపీ నాయకులు జిల్లాల్లో పర్యటించాలంటున్నారు టీఆర్ఎస్ నేతలు. 

యాసంగి పంట కొనుగోళ్లపై ప్రకటన చేసిన తర్వాతే సంజయ్ రావాలని సవాల్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.  కేంద్ర సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు  భూపాల్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. బండి సంజయ్ జనాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు భూపాల్ రెడ్డి. రానున్న రోజుల్లో జనం తిరగడబడతారని హెచ్చరించారు.  యాసంగి పంటను కొనేలా బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగి పంట కొనేలా బండి సంజయ్ ని నిలదీయాలని సూచించారు భూపాల్ రెడ్డి.