దళిత కుటుంబంపై టీఆర్ఎస్ నేత దాడి..

దళిత కుటుంబంపై టీఆర్ఎస్ నేత దాడి..

మహబూబాబాద్ జిల్లా; ఓ దళిత కుటుంబంపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ పట్టణ శివారలోని శనిగాపురం గ్రామంలో దళిత కుటుంబంపై టీఆర్ఎస్ 9వ వార్డు  కౌన్సిలర్  బానోత్ హరిసింగ్, అతను అనుచరులు దాడి చేశారు. గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్, వాణి దంపతులపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. మా పట్టా భూమిని కబ్జా చేసి.. మాపై దాడికి పాల్పడ్డారని ఆ దళిత కుటుంబం అరోపించింది. టీఆర్ఎ కౌన్సిలర్, హరిసింగ్ అతని అనుచరులపై చర్యలు తీసూకోవాలని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మాకు రక్షణ కల్పించాలంటూ దళిత కుటుంబ సభ్యులు  రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమెదు చేసి మహబూబాబాద్  రూరల్ పోలీసులు దర్యాప్త చేపట్టారు.