కాంట్రాక్ట్ చేసిన బిల్లులు రాలేదని అప్పుల బాధతో టీఆర్ఎస్ లీడర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమృతండా గ్రామ సర్పంచ్ శాంత చిన్నమ్మ కుమారుడు బోడ వెంకన్న గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ చేశాడు. కాంట్రాక్ట్ పనులకు గాను రూ. 15 లక్షలకు పైగా అప్పులు చేసి ప్రభుత్వం అందించిన పనులను కంప్లీట్ చేశాడు. అయితే ప్రభుత్వం నుండి ఎంతకీ బిల్లు రాకపోవడం, తెచ్చిన అప్పులకి వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వార్తల కోసం...
అభివృద్ధి కోసం అందరం కలిసి పని చెయ్యాలి
కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు చేయం