వరదకి, బురదకి కారణం ఈటల రాజేందరే

వరదకి, బురదకి కారణం ఈటల రాజేందరే

కరీంనగర్:  వరదకి, బురదకి కారణం ఈటల రాజేందరే అని అన్నారు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. శనివారం ఆయన కరీంనగర్ లో మాట్లాడుతూ..  ఏడున్నర సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఈటెలకు నియోజకవర్గం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. హుజురాబాద్‌ కు ఈటల రాజేందర్ ఒక శని అన్నారు. ఎమ్మెల్యేలను నా కొడుకల్లారా అని అంటారా.. నేను కూడా ఈటల నా కొడకా అంటున్నా అంటూ కౌశిక్ సీరియస్ అయ్యారు. ఎక్కడ చర్చ పెట్టడానికైనా మేం సిద్దంగా ఉన్నామన్న ఆయన.. ఎందుకు చర్చకు రావడం లేదు. భయం అవుతుందా? అని ప్రశ్నిస్తున్నా అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈటల చేయలేని పని మేం చేసి చూపిస్తామని కౌసిక్ రెడ్డి తెలిపారు.