
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎల్బీ నగర్ లోని ఆర్కే పురం డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ,బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆందోళన చేశారు.టీఆర్ఎస్ నేత విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. విక్రమ్ రెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపలాట జరిగింది.