సమావేశంలో గొడవ పడ్డ టీఆర్ఎస్ నేతలు

సమావేశంలో గొడవ పడ్డ టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ రాంకోఠిలో.. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో గొడవ పడ్డారు టీఆర్ఎస్ నేతలు. హోంమంత్రి మహమూద్ అలీ హాజరైన ఈ సమావేశంలో.. తనను వేదికపైకి పిలవలేదని నిలదీశాడు ఉద్యమకారుడు ఆర్వి మహేందర్. దీంతో గొడవ జరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ లొల్లి పెట్టుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. గొడవ పెట్టుకుంటున్న నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మహమూద్ అలీ.