గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు

గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు

హైదరాబాద్  : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ జన్మదినం పురస్కరించుకుని  మూడురోజుల సంబరాలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఈ సంబరాలను కించపరుస్తూ.. సీఎం కేసీఆర్ మరణం కోరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు టీఆర్ఎస్ యువజన నాయకులు. ముషీరాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగింపు చేసి దహనం చేశారు. బాధ్యతగల పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని...లేదంటే రేవంత్ రెడ్డిని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.