భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్న కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు కొట్లాడుకున్నారు. అశ్వారావు పేటలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీల ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గొడవ పడ్డారు. దమ్మపేటకు చెందిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఒకదశలో తోపులాట జరిగింది. పార్టీ నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సభ ప్రాంగణం వదిలి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్
బదిలీల విషయంలో ప్రభుత్వ తీరుపై టీచర్ల ఆగ్రహం
మల్లన్నసాగర్ అక్రమాలపై హైకోర్టులో పిటిషన్