- విచారణ జనవరి 3కు వాయిదా
హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అవకతవకలను ప్రశ్నిస్తూ ఓ రిటైర్డు ఇంజనీర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 40వేల కోట్ల నుంచి 80వేల కోట్ల పైన అంచనాలు పెంచడంపై పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచడం వెనుక అవకతవకలు జరిగాయని పిటిషనర్ ఆరోపించారు. అవకతవకలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైకోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించలేదన్న మరో పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
ఇవి కూడా చదవండి