పిల్లల దుస్తుల్లో  బంగారం దాచి తీసుకొస్తుంటే..

పిల్లల దుస్తుల్లో  బంగారం దాచి తీసుకొస్తుంటే..
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

హైదరాబాద్: పిల్లల దుస్తుల్లో, అయస్కాంతపు కడియంలో బంగారం దాచి రహస్యంగా తీసుకొస్తుంటే శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. దుబాయ్ నుండి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద సుమారు 412 గ్రాముల బంగారం అక్రమంగా తీసుకొస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. పట్టుకున్న బంగారం విలువ 20 లక్షలు పైనే ఉంటుందంటున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ తరహాలో అక్రమంగా తరలించే ప్రయత్నం చేయడం తొలిసారి గుర్తించామని.. కేవలం అనుమానంతో తనిఖీలు చేయడం వల్ల పిల్లల దుస్తులు, అయస్కాంతపు కడియంలో బంగారం తరలింపు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

బంగారు తెలంగాణలో అన్ని చార్జీలు పెరిగినయ్

విశాక ఇండస్ట్రీస్‌ ఆవిష్కరణకు పేటెంట్ ఇష్యూ చేసిన అమెరికా