GHMC ఎన్నికల్లో TRS, MIM రహస్య పొత్తు పెట్టుకున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మేయర్ ఎన్నికతో వారి బండారం బయటపడుతుందన్నారు. మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో …టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్నక్రమంలో… కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలిసి బిర్యానీ తింటారంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు కిషన్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ, కేసీఆర్ ఆపలేరన్నారు.