రైతుబంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదు

 రైతుబంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదు

కాళేశ్వరం కట్టి రైతుల్ని TRS కారెక్కిస్తే.. BJP మాత్రం రైతుల మీదకు కారెక్కిచ్చిందన్నారు TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎలక్షన్స్ వస్తే ఓట్ల కోసం కాంగ్రెస్-బీజేపీలు జైకిసాన్ అంటారని... ఓట్లు ఐపోయాకా నై కిసాన్ అంటారని విమర్శించారు. రైతు బంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు.

ఇక రాష్ట్రంలో మతకల్లోలాలు లేవన్నారు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. నేరాలు అరికట్టడం, నేరస్తులను అరెస్ట్ చేయడంలో పోలీసులు దేశంలోనే నంబర్ వన్ లో ఉన్నారని తెలిపారు.