4వేల ఇళ్లు మంజూరు చేస్తే..ఈటల ఒక్కటి కూడా కట్టలే

4వేల ఇళ్లు మంజూరు చేస్తే..ఈటల ఒక్కటి కూడా కట్టలే

హుజూరాబాద్ లో 4వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తే.. ఈటల ఒక్కటి కూడా కట్టలేదన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈటలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికార పార్టీలో మంత్రిగా ఉండి కూడా హుజూరాబాద్  కు ఏమీ చేయలేక పోయారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈటల బాగోతం మొత్తం కేసీఆర్ కు అర్థం అయ్యే ఆయనను పార్టీ నుంచి పంపించాడన్నారు.  కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేశారని... బీజేపీని  కూడా నాశనం చేస్తారన్నారు. అందుకే ఈటలకు బీజేపీ సపోర్ట్  లేదన్నారు.