మల్లారెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ

మల్లారెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ

మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్యే మైనంపల్లితో మల్లారెడ్డికి విభేదాలు బహిర్గతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా ఉదయం మైనంపల్లి నివాసంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇతర ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయొద్దని మల్లారెడ్డి కలెక్టర్ కు చెప్పాడని అసమ్మతి ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాము చేపట్టే పనులకు మంత్రి అడ్డుతగులుతున్నాడని ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని తన మనిషికి ఇప్పించుకున్నారని ఎమ్మెల్యే వివేక్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.