అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

రాజస్థాన్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాకు కవిత చాదర్ ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు. అనంతరం ఆమె దర్గా పెద్దలను కలిశారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కవిత  కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. 

అదేవిధంగా, రాజస్థాన్ లోని పుష్కర్ దేవాలయాన్ని, శ్రీనాథ్ జీ దేవాలయాన్ని కూడా కల్వకుంట్ల కవిత సందర్శించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజం అలి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్, టీఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్, అలిం తదితరులు అజ్మీర్ దర్గాని సందర్శించారు.