డాన్స్ చేస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు..13 మంది మృతి

డాన్స్ చేస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు..13 మంది మృతి

జైపూర్‌ : పెళ్లి బరాత్ తో విషాదం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహిస్తుండగా.. వారందరి పైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు హస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడింది. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు  నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన వెల్లడించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అశోక్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు.