టెన్త్ రిజల్ట్స్.. బాలికలదే హవా

టెన్త్ రిజల్ట్స్..  బాలికలదే హవా

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది  86.60శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ లో లాగే పదో తరగతి ఫలితాల్లో కూడా బాలికలదే హవా నడిచింది. 

మొత్తం ఈ ఏడాది 4 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో  బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు . ఇక బాలికలు  88.53శాతం సాధించారు.  99 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా  నిర్మల్ నిలిచింది. 59.46  శాతంతో వికారాబాద్ జిల్లా లాస్ట్ లో ఉంది.  

2, 793  స్కూళ్లలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  25స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. జూన్ 14 నుంచి  22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి