సీఎం కేసీఆర్తో సోమేష్ కుమార్ భేటీ

సీఎం కేసీఆర్తో సోమేష్ కుమార్ భేటీ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్తో  భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ను ఏపీ కేడర్ కు వెళ్లాలంటూ కోర్టు ఉత్తర్వులుజారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై సీఎం తో సోమేష్ కుమార్ చర్చించనున్నట్లు సమాచారం. మీటింగ్ అనంతరం హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

రాష్ట్ర విభజన సమయంలో  ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా  డీఓపీటీ  రెండు రాష్ట్రాలకు  కేటాయించింది.  సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్  అలాట్  చేసింది.  అయితే తాను  తెలంగాణకు  వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ  క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  విచారణ జరిపిన క్యాట్ సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది. 2017లో కేంద్రం క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.