హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్ర కారాగారాలలో ఏళ్ల తరబడి శిక్షలు అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం ఉదయం రాష్ట్ర హోం శాఖ నుండి ఖైదీల మార్గదర్శకాలు జీఓ నెంబర్ 30 విడుదలైంది. ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబ సభ్యుల వినతులు, వయసు మీద పడినవారికి, కొన్నేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు ఉపశమనం లభించనుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జీవిత ఖైదీలు.