హైదరాబాద్, వెలుగు: జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ సెప్టెంబర్ 12న జరిపిన పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ 2లో 37 తప్పులు వచ్చాయని పలువురు హైకో ర్టును ఆశ్రయించారు. దీన్ని జస్టిస్ మాధవి దేవి సోమవారం విచారించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ టీఎస్పీఎ స్సీకి నోటీసులు జారీ చేశారు.
పేపర్ 2 (ఇంగ్లిష్)లో తప్పులు వచ్చాయని కమి షన్కు చెప్పినా పట్టించుకోకుండా ఫైనల్ కీ విడుదల చేసిందని పిటిషనర్ తరఫు లాయర్ బి.రమేశ్ కోర్టుకు వివరించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.