టీఎస్​పీఎస్సీకి హైకోర్టు నోటీసులు

టీఎస్​పీఎస్సీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12న జరిపిన పరీక్షలో ఇంగ్లీష్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లో 37 తప్పులు వచ్చాయని పలువురు హైకో ర్టును ఆశ్రయించారు. దీన్ని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాధవి దేవి సోమవారం విచారించి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ టీఎస్​పీఎ స్సీకి నోటీసులు జారీ చేశారు. 

పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 (ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో తప్పులు వచ్చాయని కమి షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పినా పట్టించుకోకుండా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ విడుదల చేసిందని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.రమేశ్ కోర్టుకు వివరించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.