
ముషీరాబాద్, వెలుగు: జీవో నం.317 బాధిత టీచర్లు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని గురువారం సెక్రటేరియట్లో కలిశారు. అనంతరం జీవో 317 బాధిత టీచర్లు మాట్లాడుతూ.. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండు మూడ్రోజుల్లో రివ్యూ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
సీఎంను కలిసిన టీఎన్ఎస్టీఏ బృందం
చేవెళ్ల: తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్(టీఎన్ ఎస్టీఏ) నేతలు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ సమస్యలను వివరించారు. సీఎంను కలిసిన వారిలో టీఎన్ఎస్ టీఏ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాణి సక్కుబాయి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కృష్ణకుమారి, రూపరాణి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు సావిత్రి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య తదితరులు ఉన్నారు.