బెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్‌‌‌‌కు దరఖాస్తులు ఆహ్వానం

బెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్‌‌‌‌కు దరఖాస్తులు ఆహ్వానం

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘బెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్ – 2025’లో పాల్గొనేందుకు ఫొటో జర్నలిస్టుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్​పీజేఏ) రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.నరహరి బుధవారం ప్రకటించారు. కాంటెస్ట్‌‌‌‌లో పాల్గొనాలనుకునే వారు మూడు 8/12 సైజ్‌‌‌‌ కలర్ లేదా బ్లాక్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ ఫొటోలను బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ టీయూడబ్ల్యూజే బిల్డింగ్‌‌‌‌లోని టీఎస్‌‌‌‌పీజేఏ ఆఫీస్‌‌‌‌కు ఆగస్ట్‌‌‌‌ 10లోగా పంపించాలని సూచించారు. 

ఆగస్ట్‌‌‌‌ 19న హైదరాబాద్‌‌‌‌లో ద్లో త్తమ ఫొటోల ప్రదర్శన ఉంటుందన్నారు. పోటీలో గెలిచిన వారికి ఫస్ట్​ప్రైజ్‌‌‌‌ కింద రూ.10 వేలు, సెకండ్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌ కింద రూ.7 వేలు, థర్డ్​ప్రైజ్‌‌‌‌ కింద రూ. 5 వేలతో పాటు 10 మందికి రూ. 2 వేల చొప్పున కన్సోలేషన్‌‌‌‌ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.