మిలిట‌‌రీ కాలేజీలో ఎనిమిదో త‌‌ర‌‌గ‌‌తిలో అడ్మిషన్స్​

మిలిట‌‌రీ కాలేజీలో ఎనిమిదో త‌‌ర‌‌గ‌‌తిలో అడ్మిషన్స్​

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియ‌‌న్ మిలిట‌‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2023 ట‌‌ర్మ్‌‌ ఎనిమిదో త‌‌ర‌‌గ‌‌తిలో అడ్మిషన్స్​కు తెలంగాణ‌‌కు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్ ప‌‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌‌మిష‌‌న్(టీఎస్‌‌పీఎస్సీ) అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత‌‌: ఏడో త‌‌ర‌‌గ‌‌తి చదువుతున్న లేదా ఏడో త‌‌ర‌‌గ‌‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 1 జులై 2023 నాటికి ప‌‌ద‌‌కొండున్నర ఏళ్లకు త‌‌గ్గకుండా ప‌‌ద‌‌మూడేళ్లకు మించ‌‌కుండా ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత ప‌‌రీక్ష, వైవా వాయిస్‌‌, మెడిక‌‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాత ప‌‌రీక్షలో మ్యాథ్స్​, జ‌‌న‌‌ర‌‌ల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల‌‌కు వైవా వాయిస్ నిర్వహిస్తారు. దీనిలో క‌‌నీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి‌‌. చివ‌‌రగా మెడిక‌‌ల్ టెస్ట్ ఉంటుంది. 

ద‌‌ర‌‌ఖాస్తులు: ఆఫ్‌‌లైన్ ద్వారా తెలంగాణ స్టేట్‌‌ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీఎస్‌‌పీఎస్సీ), నాంపల్లి,  హైదరాబాద్‌‌, తెలంగాణ-500001 అనే అడ్రస్​కు అక్టోబర్​ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  జ‌‌న‌‌ర‌‌ల్ అభ్యర్థుల‌‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. డిసెంబర్​ 3న ఎగ్జామ్​ నిర్వహిస్తారు. వివరాలకు www.tspsc.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.