TSPSCg: పేపర్ల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSCg: పేపర్ల లీకేజీ కేసులో  మరో ఇద్దరు అరెస్ట్
  •     87కు చేరిన నిందితుల సంఖ్య

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీఎస్‌‌‌‌ పీఎస్‌‌‌‌సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్‌‌‌‌ మాజీ ఏఈ పూల రమేశ్  వద్ద ఏఈ పేపర్​ను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని బుధవారం సిట్‌‌‌‌  అధికారులు అరెస్టు చేశారు. నిందితులను హనుమకొండ ఎస్‌‌‌‌వీఎస్‌‌‌‌  ఇంజినీరింగ్‌‌‌‌  కాలేజీలో లెక్చరర్‌‌‌‌గా పనిచేస్తున్న గుగులోతు అనూష అలియాస్‌‌‌‌  విను, సిద్దిపేటకు చెందిన కమ్మసారం జ్ఞానితగా గుర్తించారు. వీరితో ఈ కేసులో 
ఇప్పటిదాకా అరెస్టయిన నిందితుల సంఖ్య 87కు చేరింది.