- 87కు చేరిన నిందితుల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ మాజీ ఏఈ పూల రమేశ్ వద్ద ఏఈ పేపర్ను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని బుధవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితులను హనుమకొండ ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న గుగులోతు అనూష అలియాస్ విను, సిద్దిపేటకు చెందిన కమ్మసారం జ్ఞానితగా గుర్తించారు. వీరితో ఈ కేసులో
ఇప్పటిదాకా అరెస్టయిన నిందితుల సంఖ్య 87కు చేరింది.