ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
  •     ఎండీ సజ్జనార్​కు వినతి

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని టీఎస్​ఆర్టీసీ స్టాఫ్​అండ్​వర్కర్స్​యూనియన్ డిమాండ్​ చేసింది. యూనియన్​నాయకులు శుక్రవారం సంస్ధ​ఎండీ సజ్జనార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు 2017

ఏప్రిల్1 నుంచి ఒక పేస్కేల్, 2021, ఏప్రిల్​1 నుంచి మరొక పేస్కేల్ అమలులోకి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆర్​పీఎస్​–2013  నాటి వేతనాలతోనే కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్​పీఎస్​–2017 ఏ విధంగా ఉండాలో కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు.