- ఎండీ సజ్జనార్కు వినతి
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్అండ్వర్కర్స్యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్నాయకులు శుక్రవారం సంస్ధఎండీ సజ్జనార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు 2017
ఏప్రిల్1 నుంచి ఒక పేస్కేల్, 2021, ఏప్రిల్1 నుంచి మరొక పేస్కేల్ అమలులోకి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆర్పీఎస్–2013 నాటి వేతనాలతోనే కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్పీఎస్–2017 ఏ విధంగా ఉండాలో కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు.