హైదరాబాద్, వెలుగు : ఆదాయంపై ఫోకస్చేసిన టీఎస్ ఆర్టీసీ, మరిన్ని సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ద్వారా, లాజిస్టిక్ సర్వీసుల ద్వారా అందిస్తుండగా, తాజాగా ఆవకాయ పచ్చడిని ప్రజలకు చేర వేసేందుకు సన్నద్ధమైంది. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని బంధువులు, స్నేహితులకు పంపించుకోవాలనుకునే వారికి టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సేవలు అందించనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
నగరంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్కౌంటర్ల ద్వారా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలతోపాటు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలోని ప్రాంతాలకు ఆవకాయ పచ్చడి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్సెంటర్ నంబర్లు 040–23450033,040–69440000,040–69440069 ను సంప్రదించాలని కోరారు.