చిలుకూరు బాలాజీ టెంపుల్​కు వజ్ర బస్సులు

చిలుకూరు బాలాజీ టెంపుల్​కు వజ్ర బస్సులు

మెహిదీపట్నం,వెలుగు: చిలుకూరు బాలాజీ టెంపుల్​కు వెళ్లే భక్తుల కోసం మెహిదీపట్నం రైతు బజార్ బస్టాప్ నుంచి డైలీ 2 వజ్ర మినీ ఏసీ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ సూర్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.   వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. వజ్ర మినీ ఏసీ బస్సులు డైలీ ఉదయం 6.05 గంటలకు రైతు బజార్ నుంచి మొదలై.. 30 నిమిషాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకుంటాయన్నారు. ప్రతి 30 నిమిషాలకు ఓ సర్వీస్ చొప్పున రెండు బస్సులు మొత్తం 24 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. చార్జి రూ.60 ఉంటుందన్నారు. వీకెండ్ లో ప్యాసింజర్లు ఎక్కువగా ఉంటే అదనపు ట్రిప్పులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.