ఆ భక్తులకు బ్రేక్ దర్శనమే...లేదంటే డబ్బు వాపస్

ఆ భక్తులకు బ్రేక్ దర్శనమే...లేదంటే డబ్బు వాపస్

కరోనా సమయంలో శ్రీవారి సేవా టికెట్లను ముందస్తుగా నమోదు చేసుకుని ఆ భాగ్యం పొందలేని భక్తుల కోసం తిరిగి.. ఆ సేవలకు అనుమతించలేమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే వారు బ్రేక్ దర్శనానికి రావచ్చని సూచించారు. కొవిడ్ సమయంలో 2020 మార్చి 20 నుంచి 2021 ఏప్రిల్ 13 వరకు భక్తులను సేవలకు అనుమతించలేదు. స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించారు.

ఈ సమయంలో శ్రీవారి సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం, తిరుప్పా వడ, వసంతోత్సవం, విశేష పూజ, నిజపాద దర్శనం సేవలను చూసేందుకు 17,946 మంది భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చే సుకున్నారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు అవకాశం లభిస్తుందని నిరీక్షిస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ సేవలకు వారిని అను మతించలేమని అధికారులు చెప్పారు. బ్రేక్ దర్శనం లేదా సొమ్మును వాపసు తీసుకోవచ్చని సూచించారు. ఇందులో భాగంగా సుమారు 8, 965 మంది బ్రేక్ దర్శనం చేసుకోగా.. 8,717 మంది ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.