చిరుత దాడిలో గాయపడిన ఐదేళ్ల బాలుడిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడికి మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు.
జూన్ 22న తిరుమల నడక మార్గంలోని ఏడవ మైలురాయి దగ్గరకు వచ్చిన చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లేప్రయత్నం చేసింది. ఈ ఘటనను చూసిన పోలీసులు భక్తులు,గట్టిగా కేకలు వేయడంతో భయపడి బాలుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు.