శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..

తిరుపతి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడకుండా త్వరగా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.శుక్ర,శని,ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని ధర్మారెడ్డి వెల్లడించారు.