డిసెంబర్ నెల కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడి

డిసెంబర్ నెల కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడి

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 స్పెషల్ దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్‌ నెల మొత్తానికి సంబంధించిన టికెట్లు టిటిడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 

టికెట్ ఎలా పొందాలంటే..


శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందాలనే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌(tirupatibalaji.ap.gov.in) లోకి వెళ్లాలి. అక్కడ తమ పేర్లతో  భక్తులు రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే రిజిస్టర్‌ చేసుకున్నవారైతే లాగిన్‌ వివరాలను టైప్ చేసి...లేటెస్ట్‌ అప్‌డేట్‌లో ఉండే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఏ రోజు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో...తేదీతో పాటు..దర్శన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి..అనంతరం రూ. 300 చెల్లించాలి.

భక్తుల రద్దీ..


మరోవైపు తిరుమలకు భక్తుల పోటెత్తారు. గురువారం స్వామి వారిని 61 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టిటిడి వెల్లడించింది. అటు సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తుల వేచి ఉన్నారని తెలిపింది. గురువారం  శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చినట్టు చెప్పింది. స్వామివారికి 30,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించింది.