శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) డిసెంబర్‌ నెలకు సంబంధించిన రూ.300 గల ప్రత్యేక దర్శనం కోటాను విడుదల చేసింది. ప్రతీ రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పలు స్లాట్లలో రోజుకు 19 వేల టికెట్లను భక్తులకు జారీ చేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

భక్తులంతా కరోనా నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని సూచించారు. ఆలయంలో నిత్యమూ శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులు, ముందుగానే తిరుమలకు చేరుకుని, తమకు నిర్దేశించిన సమయంలో దర్శనం చేసుకోవచ్చని TTD ప్రకటించింది. వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలని, మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడవద్దని తెలిపింది.